ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ను కలిశారు విఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు. ఈ సందర్భంగా ఏపి రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగినది.  క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుధీర్ఘంగా చర్చ, పరస్పరం ఆలోచనలు పంచుకున్నామన్న డాక్టర్‌ నోరి.  

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్సకోసం ఆస్పత్రులు పెట్టాలని, అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటచేయాలని సీఎం సంకల్పించినట్టు వెల్లడించారు.  వివిధ మెడికల్‌కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సలను దీనికింద తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళికగా సమావేశం తర్వాత వెల్లడించిన డాక్టర్‌ నోరి...   క్యాన్సర్‌ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి జగన్ గారి ఉద్దేశమని స్పష్టం చేశారు.  

క్యాన్సర్‌చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగిందన్న డాక్టర్‌ నోరి... రాష్ట్రానికి తగిన సహాయసహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికి ముఖ్యమంత్రిగారు సంతోషించారని వెల్లడించారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ చికిత్సా విధానంలో గొప్ప అడుగు ముఖ్యమంత్రిగారి సమావేశం ద్వారా ఏర్పడిందన్న డాక్టర్‌ నోరి... సీఎంగారు ఆరోగ్యరంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయని వివరించారు.  మెడికల్‌ కాలేజీలను, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం అన్నది నాకు చాలా ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు నోరి. చిన్న గ్రామం లో క్యాన్సర్‌ రోగి ఉన్నా.. చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి జగన్ గారి ఆలోచన అని వెల్లడించారు  డాక్టర్‌ నోరి.  ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని కోరారు ముఖ్యమంత్రి జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: