
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాక్స్వెల్ తన ఆట తీరత ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. అటు ఐపిఎల్ లో కూడా పలు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతూ తన విధ్వంసకరమైన ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు అని చెప్పాలి. దీంతో ఎన్నో రికార్డులు కొల్లగోడుతున్నాడు. ఇలా మంచి ఫామ్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మాక్స్వెల్ ఇటీవల అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే అది క్రికెట్ గురించి కాదు.. తన పర్సనల్ లైఫ్ గురించి. తాను తండ్రిని కాబోతున్నాను అంటూ శుభవార్త చెప్పాడు మాక్స్వెల్.
ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇండియాకు చెందిన విని రామన్ ను పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీరి వివాహం జరిగింది. హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఇక వీరిద్దరూ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు అని చెప్పాలి. ఇలా ఆస్ట్రేలియా క్రికెటర్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో హార్ట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తన భార్య విని రామన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని మ్యాక్స్ వెల్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఫాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.