మ్యాన్ వర్సెస్ వైల్డ్, బేర్ గ్రిల్స్.. డిస్కవరీ ఛానల్ను చూసే వారికి ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఛానెల్ ఏ రేంజ్లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బేర్ గ్రిల్స్, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. ఈ షోని మొత్తం హోస్ట్ చేసే బేర్ గ్రిల్స్కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ఇక బేర్ గ్రిల్స్ హోస్ట్ చేసే ఈ షోలో ఇప్పటికే పలువురు ప్రముకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించిన డిస్కవరీ ఛానల్ యాజమాన్యం మరోసారి మనదేశ గడప తొక్కింది. దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్తో ఇటీవల మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించింది. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్కులో మూడు రోజుల పాటు బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ చేశారు. అయితే రజినీకాంత్తో మొదటి ఎపిసోడ్ కు ఖచ్చితంగా భారీ రెస్పాన్స్ వస్తుంది అని అంతా ఊహించారు.
కానీ అందరి ఊహలకు అందకుండా ప్రపంచంలోనే రికార్డు సృష్టించినట్టు తెలుస్తుంది. బేర్ తో మోడీ కలిసి ప్లాన్ చేసిన ఎపిసోడ్ ప్రీమియర్స్ కు గాను ఒక కోటి 20న లక్షలకు పైగా వ్యూవర్ షిప్ రాగా తలైవర్ ప్రీమియర్స్ కు మాత్రం మూడు కోట్ల ముప్పై లక్షలకు పీలగా వ్యూవర్ షిప్ వచ్చాయట. ఇది ప్రపంచంలోనే ఏ షోకు కూడా రాని వ్యూవర్ షిప్ అని డిస్కవరీ ఛానెల్ వారే వెల్లడించారు. ఏదేమైనా దీని బట్టీ రాజినీకాంత్కు ఉన్న ఫ్యాన్ ఫాలోంగ్ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న రజినీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారట.