కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలుపై చర్చ ఆంక్షల సడలింపు లేక కొనసాగింపుపై సలహాలు తీసుకుంటున్న మోదీ ఎఫ్ఆర్బీఎం పరిమితి, ఆర్థిక సాయంపై చర్చ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు, ఇప్పటివరకు విధించిన ఆంక్షల సడలింపు లేక కొనసాగింపు వంటి అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేసే విషయంపై కూడా చర్చిస్తున్నారు.
అయితే మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించాలని ఆ మద్య ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించిన విషయం తెలిసిందే. కానీ అప్పటి నుంచి పెద్దగా దగ్గుదల మాత్రం కనిపించలేదు. లాక్ డౌన్ విధించినప్పటికీ దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
లాక్ డౌన్ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే, ఎఫ్ఆర్బీఎం పరిమితి, ఆర్థిక సాయం వంటి అంశాలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple