ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ తో  కొట్టుమిట్టాడుతున్న వేళ  ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. కానీ కేవలం డాక్టర్లు హెల్త్ వర్కర్లు పోలీసులు పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ డైరెక్టుగా కరోనా పేషెంట్లకు సేవలందిస్తూ ఎంతగానో కృషి చేస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరోగ్య కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్  పెట్టారు.

 

 

క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని సురక్షితంగా మరియు భద్రంగా ఉంచడానికి ఆరోగ్య కార్యకర్తలు నిస్వార్ధంగా అవిరామంగా పని చేస్తున్నారు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. ఇలా నిస్వార్థంగా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా వారికి కృతజ్ఞతలు తెలిపారు మహేష్ బాబు. ఆరోగ్య కార్యకర్తలు అందరూ మనల్ని రక్షించడం కోసమే తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా చేస్తున్నారన్నది మనందరం అర్థం చేసుకోవాలి అంటూ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్  పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: