టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని అన్నారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు లెక్క చైయడం లేదు అంటూ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు అందరూ గజగజా వణుకుతారని.. రాజధాని కోసం 158 రోజులుగా దీక్ష జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని అన్నారు. 
 
రాష్ట్రంలో సగం జనాభా జగన్ ఇంటి ముందు కూర్చుంటే ఆయన మాట వింటాడేమో...? అని అన్నారు. నీళ్ల విషయంలో అన్నదమ్ములు అయినా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారని... పోతిరెడ్డి పాడు విషయంలో మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడు అనిపిస్తోందని జగన్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: