దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజు పది వేల వరకు కరోనా కేసులు ఉండగా నేడు ఆ సంఖ్య 12 వేలకు చేరింది. 12,375 కొత్త కేసులు నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. 388 మంది రికార్డ్ స్థాయిలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల దిశగా వేగంగా వెళ్తుంది. బహుశా రేపటి తో మూడు లక్షల కేసులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు ఒకసారి చూస్తే 287,155 గా ఉన్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. 8,107 మంది మరణించారు. 140,979 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: