హైదరాబాద్ లోని ఒక భూ వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వీర ప్రసాద్ ఈ భూ వివాదం లో చిక్కుకున్నారు. ఈ వివాదంలో వైఎస్సార్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు పలు కేసులు నమోదు చేసారు అని సమాచారం. 

 

ఆయనను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. వివాదం నేపథ్యంలో  ఆయన కైలాష్ విక్రం ఇంట్లోకి బౌన్సార్లను తీసుకుని వెళ్లి దాడికి దిగాడు అని కైలాష్ ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్ళు రంగంలోకి దిగారు. దీనితో ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: