అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండియన్స్ ని ఆకట్టుకోవడానికి కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. భారతీయుల ఓట్ల కోసం తీవ్రంగా ఆయన శ్రమిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ ఇండియా భారత్ సంబంధాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య  అత్యంత విలువైన స్నేహం ఉంది అని చెప్పారు.

ఇది తమకు చాలా గౌరవంగా ఉందని ఆయన అన్నారు. వారిద్దరు అత్యంత శక్తివంతమైన బంధాన్ని కలిగి ఉన్నారని చెప్పారు.  మన రెండు దేశాలు భవిష్యత్తులో కలిసి  ముందుకు వెళ్తాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్లను ఆకట్టుకోవడానికి ట్రంప్ మన దేశంపై ప్రసంశలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: