హాథ్రస్ హత్యాచార ఘటనపై
సీబీఐ దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
సీబీఐ దర్యాప్తు పూర్తయ్యాక విచారణ ఢిల్లీకి బదిలీ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.బాధిత కుటుంబం, సాక్షుల భద్రతనూ అలహాబాద్ న్యాయస్థానమే పరిశీలిస్తుందని తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్లో బాధితులకు సరైన న్యాయం జరగదని, విచారణను బదిలీ చేయాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని పరిశీలించిన సుప్రీం..
అలహాబాద్ హైకోర్టు ముందు
సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ దళిత యువతిపై
సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై
యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది.