హాథ్రస్​ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తును అలహాబాద్​ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యాక విచారణ ఢిల్లీకి బదిలీ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.బాధిత కుటుంబం, సాక్షుల భద్రతనూ అలహాబాద్​ న్యాయస్థానమే పరిశీలిస్తుందని తెలిపింది.


ఉత్తర్ప్రదేశ్లో బాధితులకు సరైన న్యాయం జరగదని, విచారణను బదిలీ చేయాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని పరిశీలించిన సుప్రీం.. అలహాబాద్ హైకోర్టు ముందు సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: