ఇండియన్​ ప్రీమియర్​ లీగ్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో కోల్​కతాపై చెన్నై విజయం సాధించింది. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా క్రీజులో ఉన్న జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.


173 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి ఆరంభాన్నిచ్చారు. భాగస్వామ్యం 50 పరుగులు పూర్తి చేశాక.. వాట్సన్‌ (14) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్‌ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రింకూ చేతికి చిక్కి వాట్సన్​ ఔటయ్యాడు. మరో ఎండ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు ఎడాపెడా బౌండరీలు బాదాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: