గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు బిజెపి కీలక నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రచారం కోసం హైదరాబాద్ కి మహారాష్ట్ర కీలక నేతలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక కర్ణాటకకు చెందిన మంత్రులు కూడా వస్తున్నారు అని సమాచారం. కేంద్ర మంత్రులతో పాటుగా రాష్ట్ర మంత్రులు కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అలాగే మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రచారం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ప్రచారానికి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇక బెంగాల్ బీజేపి చీఫ్ దిలీప్ ఘోష్ కూడా ప్రచారం చేయడానికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. వీరు రెండు రోజుల్లో హైదరాబాద్ లో దిగే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: