గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు మజ్లీస్ పార్టీ చేసిన అక్రమ కట్టడాల కూల్చివేత ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఎన్టీఆర్ ఘాట్ ను కూలుస్తామని మజ్లీస్ ఎమ్మెల్యే ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపధ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు అనుమతి లేదని చెప్పినా సరే ఆయన మాత్రం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వస్తున్నారు.

ఇక కాసేపటి క్రితం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు... బిజెపి నేతలకు షాక్ ఇచ్చారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చి ఇక్కడికి రావాలి అని డిమాండ్ చేసారు. ఎన్టీఆర్ ఘాట్  కూల్చివేస్తామని ఎంఐఎం నేతలు చేసిన  వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: