సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణరాజు వరుస లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 7వ  లేఖ రాశారు. తాజా లేఖలో రైతు భరోసా అంశాన్ని పేర్కొన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన ఆయన ఎన్నికల్లో రైతులు పెద్దఎత్తున్న పార్టీ అండగా నిలిచారని అన్నారు. 


రైతు భరోసాను 12,500 నుండి 13,500 కి పెంచుతామని హామీ ఇచ్చారని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 13,500 పాటు కేంద్రం ఇచ్చే 6వేలు కలిపి 19,500 ఇవ్వాలని కోరారు ఆయన. ఇక ఎన్నికల సమయంలో జీరో ఇంట్రెస్ట్ తో లోన్స్ ఇస్తామని హామీ ఇచ్చారని,  బొరేవెల్, కోల్డ్ స్టోరేజ్, ట్రాక్టర్లలకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు ఇస్తామన్నారని అవన్నీ నెరవేర్చాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: