ఓ ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ముగ్గురు యాంకర్లు త‌మ‌ను వేధిస్తున్నారంటూ ఆఫీస్ సిబ్బంది  సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే
. త‌మ ఫోటోల‌ను వీడీయోల‌ను తీసుకుని యాంక‌ర్లు వేధిస్తున్నారంటూ ఆఫీస్ సిబ్బంది పోలీసుల‌కు ఆశ్ర‌యించారు . కాగా దీనిపై తాజాగా టీవీ9 సంస్థ‌ స్పందించింది . టీవీ9 ఛానల్ లో పనిచేస్తున్న ముగ్గురు యాంకర్స్ మధ్య వివాదం కారణంగా హైదరాబాద్ పోలీసులు డేటా దొంగతనం ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపింది . 

సిబ్బంది ప్రవర్తన మ‌రియు ఆరోపించిన నేరంలో వారి పాత్ర పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని కానీ వారి అధికారిక విధుల‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలీసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తున్నామని చెప్పింది. అంతర్గత క్రమశిక్షణ విచారణను కూడా తాము ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: