మనుషుల మధ్య ఒక బంధం బలపడాలంటే వారి మధ్య సరదాలు ,సరసాలు, కోపాలు, తాపాలు వస్తేనే ఒక త్రిల్ ఉంటుందని జనాలు అంటున్నారు. ఇకపోతే భార్య , భర్తల మధ్య గొడవలు, చిలిపి సరసాలు చాలా కామన్ .. అయితే ఆ గొడవలను సర్దుకొని మానేస్తే తగ్గిపోతాయి.. అలా లేకపోతే గొడవలు ఎక్కువై కుటుంబాలు పూర్తిగా విడిపోతాయి..అసలు విషయానికొస్తే .. ఇక్కడ కొన్ని గొడవలు విచిత్రంగా జరిగాయి. ఆదివారం చికెన్ చేయలేదని ఓ భర్త భార్యను చంపిన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఆదివారం కావున అందరూ చికెన్ చేసుకున్నారు.. తన ఇంట్లో చికెన్ చేయలేదని  భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర ప్రైవేట్ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మధుర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. ప్రస్తుతం గర్భవతి అయిన మధుర కొద్దిరోజుల క్రితం బాగేపల్లి తాలూకా హొసహుడ్యలోని పుట్టింటికి వచ్చింది.

 

 

తల్లి దండ్రులను చుడాటానికి మధుర పుట్టింటికి వెళ్లింది.. భార్యను చూసేందుకు బాలచంద్ర ఆదివారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చాడు. మద్యం తాగుతూ చికెన్ కర్రీ వండాలని భార్యకు చెప్పాడు. దీంతో మధుర గ్రహణం కారణంగా చికెన్ చేయలేనని చెప్పింది.. మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర  తన కోరిక తీర్చలేదని భార్యతో గొడవపడ్డాడు. రాత్రి గదిలో మరోసారి ఇదే విషయమై గొడవపడిన అతడు ఆవేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు.

 

 


సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి  వచ్చారు.. కేసు నుంచి తప్పించుకునేందుకు తాను పడుకున్న సమయంలో మధుర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని బాలచంద్ర ఆమె కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తానికి గుట్టు రట్టు చేశారు.. తన కోపమే తన శత్రువు అని అంటారు పెద్దలు.. కోపంతో చేసిన చిన్న తప్పు ఇప్పుడు అతనిని కటకటాల పాలైయ్యేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: