అత్యాచారాల విషయంలో ఎంత కఠినంగా ఉన్నా సరే అవి మాత్రం ఆగడం లేదు. దీని వలన ప్రజల్లో కూడా ఒకరకమైన భయం అనేది ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు చాలా వరకు అత్యాచారాలు సంచలనం అవుతున్నాయి. ఇక అత్యాచారాల విషయంలో సిఎం లు సహా న్యాయస్థానాలు ఎంత సీరియస్ గా ఉన్నా సరే అవి మాత్రం ఆగడం లేదు అనే భావన చాలా మందిలో ఉంది. ఇక కొన్ని మృగాలు ఇప్పుడు అత్యాచారాల విషయంలో వెనుకా ముందు ఆలోచన చేయడం లేదు.

ఈ అత్యాచారాల వలన చిన్న చిన్న పిల్లలు కూడా బలైపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీని వలన ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఏపీలో దిశా చట్టం తీసుకొచ్చినా తెలంగాణాలో కాల్చి చంపేసినా సరే ప్రజల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు అనే విషయం చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కాకినాడ లో ఒక ఘటన జరిగింది. ప్రశాంతంగా ఉండే కాకినాడ నగరంలో జరిగిన ఈ దారుణం ప్రజలను భయపెడుతుంది. మంచం పై పడుకున్న చిన్నారిని తీసుకుని వెళ్లి అత్యాచారం చేసాడు ఒక మృగం.

ఆ చిన్నారికి బ్లీడింగ్ కావడంతో వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసారు. వైద్యం కూడా చేయలేకపోయారు కొందరు. ఇక ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై సిఎం వైఎస్ జగన్ ఆరా తీసారు. నిందితుడుని పట్టుకోవాలని బాధిత కుటుంబానికి వెంటనే అధికారుల నుంచి సాయం అందాలి అని ఆయన సూచనలు చేసినట్టు గా సమాచారం. ఇక మంత్రిని వెళ్లి పరామర్శించాలి అని ఆయన సూచించారు అని తెలుస్తుంది. ఈ ఘటన జాతీయ మీడియాలో కూడా వచ్చింది. మరి ఈ విషయంలో న్యాయం ఎంత వరకు జరుగుతుందో చూడాలి. బాలిక వయసు 5 ఏళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: