ఇదిలా ఉండగా.. భారత్లో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో బూస్టర్ డోస్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జనవరి 10, 2022 నుంచి 60 ఏండ్లు దాటిన వారికి బూస్టర్ డోస్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా బూస్టర్ డోస్లుగా ఏ వ్యాక్సిన్ను ఇవ్వబోతున్నారన్న దానిపై మాత్రం కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.
మక్సింగ్, మ్యాచింగ్ పద్దతిలో డోస్ ఉంటుందా లేదంటే గతంలో ఇచ్చిన కొవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వాక్సిన్ను ప్రికాషన్ డోస్గా ఇస్తారా అనేది చూడాలి మరీ. ఒక వేళ కోవీషీల్డ్ లేదా కొవాగ్జిన్ను ప్రికాషన్ డోస్గా ఇస్తే తప్పనిసరిగా మూడవ డోస్కు 9 నుంచి 12 నెలలు గ్యాప్లో ఇవ్వాలి. ఈ రెండు వ్యాక్సిన్ల మధ్య విరామం అదేవిధంగా ఉండడంతో మూడవ డోస్ ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బూస్టర్ బోస్ ఏమి ఇవ్వబోతున్నారనేది త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.