రాజమౌళి కుటుంబం నుండి ఇద్దరూ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారంటే ఎలాంటి హంగామా ఉండాలి. అది కూడా పేరొందిన కీరవాణి ఇద్దరు తనయులు ఒకే సినిమా ద్వారా లాంచ్ అవడం చిన్న విషయం కాదు. కీరవాణి ఇద్దరు కొడుకులు. ఒకరేమో హీరోగా, మరొకరు సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రం ’మత్తు వదలరా". రితేష్ రానా దర్శకత్వం వహించినఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ఎంటర్ టైన్ మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

 

ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణని దక్కించుకుంది. ముగ్గురు యువకులు అమాంతం డబ్బుకి ఆశపడి దొంగతనం చేసి, ఆ తర్వాత ఏం జరిగిందో చూడాల్సిన కథలాగా అనిపించింది. కథ ఇప్పటి సమాజానికి తగ్గట్టు చాలా చక్కగా ఉందనిపించింది. ట్రైలర్ తో ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రేపు విడుదల అవుతుంది. ఐతే ఈ సినిమా ప్రీమియర్ షో మంగళవారం రాత్రి వేయనున్నారు.

 

సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలు సైతం ప్రీమియర్ షోస్ వేయట్లేదు. ముందే టాక్ బయటకి వచ్చేస్తే ప్రాబ్లెమ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో సినిమాని ముందుగా విడుదల చేయడానికి జంకుతున్నారు. చిన్న చిన్న సినిమాలు సైతం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కానీ మత్తు వదలరా టీం మాత్రం సాహసిస్తుంది. ప్రామిసింగ్‌ ప్రోమోలతో పాటు  నిజంగానే విషయం వుందనిపిస్తోన్న 'మత్తు వదలరా' టీమ్‌ మాత్రం తమ చిత్రాన్ని ముందుగా మీడియాకి చూపించేస్తే మంచి టాక్‌ వస్తుందని నమ్ముతున్నారు. 

 

అందుకే ఇటీవల ఎవరూ చేయని ధైర్యం వాళ్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో రాజమౌళి సినిమా గురించి ఎంత సేపు మాట్లాడాడో తెలిసిందే. సినిమా తనకి చాలా నచ్చిందని ఆయన మాటల్ని బట్టి అర్థం అయింది. రాజమౌళికి అంతగా నచ్చిన సబ్జెక్టు జనాలకి కూడా నచ్చుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: