సుకుమార్ దర్శకత్వంలో
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న
సినిమా పుష్ప. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా యొక్క మొదటి భాగం
క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. సినిమాను తెరకెక్కించే నేపథ్యంలో ఈ
సినిమా నిడివి ఎక్కువగా రావడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట చిత్రబృందం.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే
డిసెంబర్ లో ఎప్పుడు అనేది విడుదల తేదీ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పాన్
ఇండియా సినిమా గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ
సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇటీవలే
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఓ పాట విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాక్కో దాకా మేక అంటూ ఐదు భాషలలో ఈ పాటను ఒకేసారి విడుదల చేసిన చిత్ర బృందం ఒకేసారి 5 భాషల్లో క్రేజ్ సంపాదించుకోవటం విశేషం.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నారట
సినిమా యూనిట్. ఈ పాటను కూడా మొదటి పాట ను చేసినట్లుగానే ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. దీన్ని బట్టి ఈ
సినిమా బృందం చిత్రం పై ఎంతటి గట్టి నమ్మకంతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో
అల్లు అర్జున్ లారీ
డ్రైవర్ గా కనిపిస్తుండగా తొలిసారి రగ్డ్ గా కనిపిస్తూ ఉండటం ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు.