ఆ సినిమా కు రిలీజ్ కు ముందు రు. 55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓ డెబ్యూ మూవీ హీరోకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే పెద్ద రికార్డు గానే నిలిచింది. అయితే ఆ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యింది. అఖిల్ రెండేళ్ల పాటు బయటకు రాలేదు. ఆ తర్వాత సొంత బ్యానర్లో మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేశాడు. ఈ సినిమాను హిట్ చేసేందుకు నాగార్జున నిర్మాత గా మారడంతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు.
హలో సినిమాకు ఓ మోస్తరు టాక్ ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియ ల్ గా మాత్రం సక్సెస్ కాలే కపో యింది. ఫలితంగా హలో కూడా అఖిల్ కు కమర్షియల్ హిట్ ఇవ్వ లేకపోయింది. ఇక మళ్లీ యేడాది గ్యాప్ తీసుకుని అట్లూరి వెంకీ దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సారి నాగ్ అఖిల్ ను గీతా కాంపౌండ్ చేతుల్లో పెట్టి హిట్ ఇవ్వమని వేడుకున్నాడు. గీతా వాళ్లు అఖిల్ కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఎలాగైనా హిట్ ఇవ్వాలని అనుకున్నారు. అయినా ఈ సినిమా కు బిలో యావరేజ్ టాక్ రావడంతో అఖిల్ హిట్ కోసం ఇంకెన్నాళ్లు. ఇంకెన్ని సినిమాల కోసం వెయిట్ చేయాలో తెలియని పరిస్థితి..!