ఇక హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన అడుగులను బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరల కారణంగా వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలకి ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది. దాంతో ఈ రంగానికి భారీ డిమాండ్ ఎక్కువ అయ్యింది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన విక్టరీ వెంకటేష్ ఈ రంగం వైపు తన అడుగులు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం అందించే బైక్ వో కంపెనీలో పెట్టుబడులతో హీరో వెంకటేష్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది.
అంతేకాక.. ఈ కంపెనీల వెంకటేష్ వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం తో పాటు ఆ కంపెనీ వెంకటేష్ ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఆ కంపెనీని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బైక్ వో తో విక్టరీ వెంకటేష్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం తో సినీ ఇండస్ట్రీలో వర్గాలతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఇక వెంకటేష్ f-3 సినిమా సినిమా తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకపోవడంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపారం వైపు దృష్టి సాగిచనున్నట్లు సమాచారం.