పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యిన తర్వాత ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేసి ఎవరికీ అందని రీతిలో దూసుకుపోతున్నాడు. ఒక హీరో సినిమాలు ఒకేసారి చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటిది దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలు ఒకేసారి నాలుగైదు చేయడం వాటిని టైంకు షూటింగ్ చేసి విడుదల చేస్తూ ఉండడం ఒక్కసారిగా అందరి హీరోలకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రాధేశ్యామ్ విడుదల పోస్ట్ పోన్ అయిన కూడా ఏమాత్రం బాధ పడకుండా తన తదుపరి సినిమా లో ముందుకు వెళుతున్నాడు ప్రభాస్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించి అభిమానులను చాలా సంతోషం లో ఉంచాడు. అలాగే ఈ సినిమా తో పాటు బాలీవుడ్ లో ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని కూడా చేసి షూటింగ్ మొదలు పెట్టాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ రాముడిగా నటిస్తూండగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండడం ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం. దాదాపు పూర్తి స్థాయికి రావడం తో మరో రెండు సినిమాలు కూడా ఇప్పుడు పట్టాలు ఎక్కించేశాడు ప్రభాస్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్టు కే సినిమాను త్వరలోనే పెట్టనున్నాడు. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో చేయబోయే స్పిరిట్ అనే చిత్రాన్ని కూడా మొదలు పెట్టనున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఆయన ఓ బాలీవుడ్ సినిమాను ఈ రెండు చిత్రాల కంటే ముందే చేయాలని భావిస్తున్నాడట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కంటే ముందే ఆయన ఈ సినిమా ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. దాంతో ఆ సినిమా తర్వాత తమ సినిమాలు ఉన్నాయని భావిస్తున్నారు దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. మరి ప్రభాస్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ హఠాత్తుగా ఓ కొత్త సినిమా ను ముందుకు తీసుకురావడం ప్రభాస్ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: