యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలు ఇటీవల ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చి ఎంత పెద్ద సక్సెస్ కొట్టాయి మనకి అందరికీ తెలిసిందే. హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సిరీస్ సినిమాలు రెండూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరి మెప్పు పొంది ఒక దానిని మించేలా మరొకటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయి.

ప్రశాంత్ నీల్ తీసిన ఈ భారీ సినిమాలకి భువన గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 ఇంకా పలు ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ రాబడుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా నార్త్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 ఇంకా తన కలెక్షన్స్ ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఏకంగా భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ని కూడా బీట్ చేసి దూసుకెళ్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఓవరాల్ గా ఎంత మేర కొల్లగొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాకి కొనసాగింపుగా చాప్టర్ 3 మూవీ ఉంటుంది అంటూ చాప్టర్ 2 క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. మరోవైపు పలు శాండల్ వుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రభాస్ తో ప్రస్తుతం సలార్ మూవీ చేస్తోన్న ప్రశాంత్ నీల్, అది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో మైత్రి మూవీ మేకర్ వారి సినిమా చేస్తారని, దాని అనంతరమే కెజిఎఫ్ చాప్టర్ 3 ప్రారంభిస్తారని సమాచారం. ఇక చాప్టర్ 3 మూవీ దాదాపుగా రూ. 200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందనుండగా దీనిని 2023 ద్వితీయార్ధంలో ప్రారంభించి 2024లో రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచనట. దీనిని బట్టి కెజిఎఫ్ చాప్టర్ 3 మూవీ కోసం ప్రేక్షకాభిమానులు మరొక రెండున్నరేళ్ల వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: