డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు ,  తమిళ ,  హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే పూరి జగన్నాథ్ ,  బాలకృష్ణ తో మూవీ కోసం కథను సిద్ధం చేయడానికి గోవా లో క్యాంపు వేశాడు అని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసింది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పూరి జగన్నాథ్ ఇప్పటికే బాలకృష్ణ మూవీ కి సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు ,  ఈ కథలో అదిరిపోయే డెప్త్ ఉన్నట్లు ,  తండ్రి కొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ కథను పూరి జగన్నాథ్ రాసినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే బాలకృష్ణ ,  పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలకు ,  డైలాగ్ డెలివరీకి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: