టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అనేక మందికి తాను ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇక అన్న వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కూడా తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు పవన్ కళ్యాణ్.పీక్ స్టేజిలో వున్నప్పుడే చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటం చేసి సినిమాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా తాను రాజకీయాలకే పరిమితం అవుతానని చెప్పినా అది వర్కౌట్ కాకపోవడంతో సినీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అయితే తమ్ముడు పవన్ మాత్రం రెండు పడాల మీద కాలు వేస్తూ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అన్న చేసిన తప్పే తమ్ముడు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక సినిమా ప్రకటించారు.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా అప్పట్లో రిలీజ్ చేశారు గాని సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు.


తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా నిలిపివేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దాని స్థానంలో విజయ్ హీరోగా నటించిన తేరి అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ తేరి సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఇక తెలుగు తమిళ భాషల్లో హిట్ అయిన ఈ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చెయ్యడం అనేది అసలు అభిమానులని సైతం షాకింగ్ కి గురి చేసే విషయం.ఇప్పుడనే కాదు గతంలో కూడా కాటమరాయుడు సినిమాని ఇదే విధంగా చేసి చేతులు కాల్చుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ పేరుతో అదే తప్పు చేశారు. గాడ్ ఫాదర్ సినిమాకి ఒరిజినల్ కంటే బావుందనే టాక్ వచ్చినా సరే దానికి తగ్గ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇప్పుడు అన్నయ్య చిరంజీవి చేసిన తప్పిదాన్ని చూసిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్త పడాలి కానీ మళ్ళీ తెలుగులో అందుబాటులో ఉన్న డబ్బింగ్ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.ఇక మిగిలిన హీరోల ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: