తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఉన్న ప్రాముఖ్యతే వేరు. సినిమాలో ఈ పాటలకి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అందుకని ఈ పాట మీద దర్శక నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇంతకు ముందు ఈ పాటల్లో స్టెప్పులేయడాని ఐటెం గర్ల్స్ ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్లే ఈ పాటలకి స్టెప్పులేస్తున్నారు. అపుడు ఈ పాటల పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు వీటిని స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఈ స్పెషల్ సాంగ్స్ లో నర్తించారు.
ప్రభాస్ సినిమా సాహో మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పనులన్ని చక చకా జరిగిపోతున్నాయి. రీసెంట్ గా చిత్ర యూనిట్ మొత్తం ఫారిన్ వెళ్ళారు. ఆస్ట్రియాలో ప్రభాస్-శ్రద్ధా కపూర్ ల మీద డ్యూయట్ చిత్రీకరిస్తున్నారు. లొకేషన్ పిక్ని షేర్ చేస్తూ ఇదొక గొప్ప అనుభూతి అని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు. అయితే ఈ రోజు చిత్రంలోని సాంగ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని,డై హార్డ్ ఫ్యాన్స్ అదెంటో కనిపెట్టండి అని పజిల్ పెట్టింది యూవీ క్రియేషన్స్.
తాజా సమాచారం ప్రకారం ఈ రోజు అనౌన్స్ చేయనున్న సాంగ్.. చిత్రంలో స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్తో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కాలు కదిపినట్టు సమాచారం. జాక్వెలిన్ సాహో మేకప్ టీంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్స్ సాహోలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేసిందంటూ కన్ఫాం చేస్తున్నారు. మరి కొద్ది గంటలలో రానున్న అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
సాహో చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.