ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తనవంతుగా రాష్ట్ర ప్రజలకు మొన్నటి తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా పధకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మధ్యలో ఆయన పై కొన్ని విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఆయన మాత్రం వాటిని పెద్దగా లక్ష్య పెట్టకుండా ప్రజాసంక్షేమమే ద్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ గా మారిన రాజధాని అమరావతి విషయమై సీఎం జగన్ గారు ఏ విధంగా స్పందిస్తారో అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజధానిని మారుస్తున్నారు అనే సంకేతాలు ఎదురువుతున్నాయని కొందరు అంటుంటే, 

మరికొందరు మాత్రం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయమై నిజానిజాలు తెలియాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే అనుకోండి. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తెలుగు అమ్మాయిలను అవకాశాల పేరుతో కొందరు లొంగదీసుకుని లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నారని వర్ధమాన నటి శ్రీరెడ్డి, మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసింది. అప్పట్లో పెను దుమారాన్ని రేపిన ఆ సమస్య, కొంత కాలం తరువాత సర్దుమణిగింది. ఇక అప్పటినుండి వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న శ్రీరెడ్డి, మధ్యలో నటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన అభిమానుల ఆగ్రహానికి గురై కొద్దిపాటి వివాదాల్లో ఇరుక్కుంది. 

ఇక ఇటీవల తన మకాం ని చెన్నైకి మార్చినప్పటికీ కూడా పవన్ పై ఆమె అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇక నేడు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డిగారిని ఉద్దేశించి శ్రీ రెడ్డి పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 'జగన్ గారూ జాగ్రత్త గా ఉండండి, శత్రువులు కొత్త కోరలకు పదును పెడుతున్నారు, వాళ్ళ ఆలోచన పూర్తి అయ్యేలోపే మనం వాళ్ళని నరికేయాలి' అంటూ ఆమె పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ శ్రీరెడ్డి ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదుకాని, కొందరు టిడిపి మరియు మరికొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ పై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: