తెలుగు
టెలివిజన్ రంగంలో అలరిస్తున్న
బిగ్ బాస్ సీజన్ 3
విన్నర్ గా సింగర్ రాహూల్ సిప్లిగంజ్
విన్నర్ అయ్యాడు. మొదటి నుంచి
రాహుల్ పై విమర్శలు వచ్చినా..100 పర్సెంట్ టాస్క్ ల్లో పాల్గొనడు అంటూ ఇతర ఇంటి సభ్యులు చెప్పినా..అన్నింటిని తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పుకుండా ఆ మద్య ఫినాలే చేరుకున్నాడు. ఇక ఐదుగురు ఇంటి సభ్యుల్లో నిన్న ఒక్కొక్కరూ ఔట్ అవుతూ చివరికి రాహూల్,
శ్రీముఖి ఫైనల్ కి వచ్చారు. గతంలో ఇంట్లో వీరిద్దరికీ అస్సలు పడేది కాదు..ఒకరిపై ఒకరి కాంప్లెంట్స్ చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు.
అనూహ్యంగా ఈ ఇద్దరే ఫైనల్ కి చేరుకోవడం విశేషం. అయితే నిన్న ఫైనల్ సందర్భంగా
బిగ్ బాస్ లో ఎంతో సందడి జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్
నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అయితే
బిగ్ బాస్ లో పాల్గొన్న ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యాక బయట ప్రపంచంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్ని విషయంపై
నాగార్జున మాట్లాడారు. కాగా,
బిగ్ బాస్ వల్ల తమ గౌరవం ఎంతో గొప్పగా పెరిగిపోయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే
బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటూ ఒక్కొక్కిరినీ అడిగారు నాగార్జున.
తమన్నా వద్దకు వచ్చిన తర్వాత ఆమె వెంటనే ఈ సీజన్
బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అంటూ బల్లాగుద్ది మరి చెప్పారు.
శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ మాములూగా లేదని..ఖచ్చితంగా ఆమె కప్ గెలుస్తుందని అన్నారు
తమన్నా సింహాద్రి.
హౌస్ లో ఉన్నన్ని రోజులు తను కంఫర్టబుల్ గా ఉండడానికి కారణం
శ్రీముఖి అని తను చాలా స్ట్రాంగ్ కంటెస్టంట్ అని చాలా బాగా ఆడుతుందని.. తనే
విన్నర్ అవుతుందని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. కానీ నిన్న జరిగిన పరిణామాలు అన్నీ తలకిందులయ్యాయి.
తమన్నా ఊహించిన ఊహలన్నీ తారుమారు అయ్యాయి. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీముకి రన్నరప్ గా నిలిచింది.