టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం రోజురోజుకు విపరీతంగా అంచనాలు పెరుగుతున్నాయి అనే చెప్పాలి. మొదట ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ఫస్ట్ ఇంట్రో టీజర్ మంచి అంచనాలు సంపాదించగా, ఆ తరువాత ఇటీవల దీపావళి కానుకగా రిలీజ్ అయిన మహేష్, విజయశాంతి, రష్మిక పిక్స్, ఆ అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇకపోతే ఈ మధ్య కొద్దిరోజులుగా ఈ సినిమా నుండి పలు లీక్డ్ ఫొటోస్ బయటకు వస్తుండడంతో సరిలేరు టీమ్ తలలు పట్టుకుంటుందట. 

అయితే వాటి వలన సినిమాకు కొంత మంచి కూడా జరుగుతోందని అంటున్న వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల లీక్ అయిన మహేష్ ఆర్మీ ఆఫీసర్ ఫోటోలు, అలానే రష్మిక లంగావోణీ ఫోటోలు చూసిన ప్రేక్షకులు సినిమాలో వారి లుక్స్ ఎలా ఉండబోతున్నాయనేదానిపై కొంత క్లారిటీకి వచ్చారని అంటున్నారు. ఇకపోతే నేడు మహేష్, విజయశాంతి ఒక పెద్ద హాల్ లో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎందుకంటే, ఆ ఫొటోలో మహేష్ బాబు, దర్శకుడు అనిల్ తో కలిసి ఏదో సీన్ గురించి మాట్లాడుతుంటే, 

ఆయనకు కొంత దూరంలో విజయశాంతి గారు, తనకు ప్రత్యేకంగా కేటాయించిన పెద్ద కుర్చీలో కూర్చుని వారిని తిలకించడం గమనించవచ్చు. ఇక ఈ ఫోటోని బట్టి సరిలేరు సినిమా యూనిట్, ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతికి ఎంతో మంచి విలువనిస్తుందని అర్ధం అవుతుందని, పలువురు నెటిజన్లు ఈ ఫోటోపై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: