ఏ
సినిమా ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరోలు తమ వారసులను సినిమాల్లోకి ఎంట్రీ చేయిస్తుంటారు. చాలా మంది హీరోల వారసులు స్వయంగా తమంతట తాముగా నటనను కెరీర్గా ఎంచుకుంటారు.
బాలీవుడ్ అయితే ఏకంగా స్టార్ హీరోల వారసురాళ్లే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఏ రేంజులో గ్లామరసం వలక బోస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక తెలుగులోనూ ఇదే పరిస్థితి ఉంది. స్టార్ హీరోల వారసుల్లో ఇప్పటికే రామ్చరణ్, అఖిల్,
నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు.
అటు నిర్మాతల వారసులు అయిన అల్లు అర్జున్, దగ్గుబాటి
రానా లాంటి వాళ్లు సైతం సినిమాలు చేస్తున్నారు. అంతెందుకు ఇటీవల స్టార్ హీరోల తనయులే కాదు. 24 శాఖల్లో పని చేసే సీనియర్ల వారసులు కూడా హీరోలు గా ప్రయత్నిస్తున్నారు. అయితే
టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఫ్యామిలీలో దివంగత
ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైన నట వారసత్వం ఇప్పుడు ఏకంగా మూడో తరం దాకా వచ్చింది.
నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోల్లో
ఎన్టీఆర్ స్టార్ హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్
హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కోసం నందమూరి అభిమానులు యేడాదిన్నర కాలంగా వెయిట్ చేస్తున్నారు. రెండు మూడు కథలు కూడా విన్నాడని అంటున్నారు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానుల గుండెలు పగిలే న్యూస్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ
తేజ నటన పట్ల ఆసక్తి గా లేడనే టాక్ వినిపిస్తోంది.
బాలయ్య తనయుడి కి
సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉందట. మోక్షజ్ఞకు బిజినెస్ అంటేనే ఇష్టమని... అందుకే అక్కడే రాణించాలన్న టార్గెట్తో ఉన్న మోక్షు మీడియాలో ఫోకస్ అయ్యేందుకు కూడా ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
బాలయ్య కూడా మోక్షజ్ఞ డెబ్యూ
సినిమా గురించి మాట్లాడక పోవడంతో ఈ వాదన నిజమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఎప్పుడో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ముందు నుంచే మోక్షు సినిమాల్లోకి వచ్చేస్తాడన్న హడావిడి నడుస్తున్నా ఇది మాత్రం ఇంకా జరగడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వార్త కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది. అదే నిజమైతే నందమూరి అభిమానులకు ఇది మామూలు షాక్ కాదు..!