బాలీవుడ్ లో మోడలింగ్ లో కెరీర్ మొదలు పెట్టిన రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత కన్నడంలో ఓ మూవీలో నటించింది.  ఆ తర్వాత తెలుగు లో కెరటం సినిమాతో పరిచయం అయ్యింది.. కానీ ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.  తర్వాత సందీప్ కిషన్ నటించిన  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది.  తెలుగు లో ఈ మూవీ మంచి సక్సెస్ సాధించిన తర్వాత రకూల్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులతో దూసుకు పోయింది.  స్టార్ హీరోల సరసన నటించిన రకూల్ ప్రీత్ సింగ్ స్కిన్ షో చేయడంలో నెంబర్ వన్.  ఈ అమ్మడు బికినీ, బెడ్ రూమ్ సీన్లు బాగా నటించింది. అంతే కాదు ఎక్కువగా షార్ట్ డ్రెస్ ల్లోనే కనిపించింది.

 

గ్లామర్ పరంగా ఎవరికైనా కొద్ది కాలమే అన్న వియం తెలిసిందే.  ఈ మద్య తెలుగు లో ఛాన్స్ లు లేకుండా పోయాయి.  దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఎంత గొప్ప హీరోయిన్ అయినా గ్లామర్ తో ఎక్కువగా రాణించలేరు.. ఈ విషయాన్ని ఇప్పుడు గ్రహించిందో ఏమో కానీ రకూల్ చాలా నిరుత్సాహంగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు చెబుతున్నారు.  

 

తనకు అవకాశాలు రాకుండా పోవడానికి కారణం ఎంటో చెప్పింది. ఆమె వివరిస్తూ.. తాను వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తూ.. అందాలను ఆరబోయటమే పెద్ద తప్పయి పోయిందని తెలిపింది.  తన గ్లామర్ పైనే ఎక్కువ స్కోప్ పెట్టడంతో నటనపై దృష్టి పడలేదు.  ఇదే ఆడియన్స్ కి నచ్చలేదని బాధపడింది. మంచి ఊపులో ఉన్నప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని, అదే తనకు ఇప్పుడు అవకాశాలు లేకుండా చేసిందని అభిప్రాయపడింది.  ఇక నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తానని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: