ప్రస్తుం ప్రపంచాన్ని కరోనా ఎంతలా కమ్మేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరూ బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు. అయితే మేడమీద అబ్బాయి అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన మలయాళ కుట్టి నిఖిలా విమల్ ఈ టైంలో అందరికి ఆదర్శవంతంగా ఉండే పనిచేస్తోంది.
ఆ సినిమా తర్వాత ఆమె గాయత్రి సినిమాలో కూడా నటించింది. మళయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం కోవిడ్-19 కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. పేదలకు సాయం చేసేందుకు తాను స్వచ్ఛందంగా ఈ కాల్ సెంటర్లో చేరినట్టు ఆమె తెలిపారు. తాళిపరాంబలోని తన ఇంటి నుంచి రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి హెల్ప్ సెంటర్కు చేరుకుంటున్నారు నిఖిలా.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పని వల్ల తనకు ప్రజలు పడుతోన్న ఇబ్బందులు అన్ని తెలుస్తున్నాయని... ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ సొల్లు కబుర్లు చెప్పే హీరోయిన్లు కొందరు అయితే.... అసలు ఈ టైంలో కూడా తమకేం పట్టనట్టు ఉండే హీరోయిన్లు నిఖిలాను చూసి కొంతైనా నేర్చుకుంటారేమో ? చూడాలి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple