ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లలో ఉండడం తప్ప చేసేదేమీ లేదు. ఇంటి పనుల్లో సాయం, హాబీలు నెరవేర్చుకోవడం, సినిమాలు చూడడం.. వంటి పనులను చేస్తున్నారు. దీనికి సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. ఇంటి పనులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ప్రోత్సహిస్తున్నారు. ఈ పనులు చేస్తూనే ఇంట్లో రిలాక్స్ మూడ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన పూజా హేగ్డే కూడా ఇదే తంతు కొనసాగిస్తోంది.

 

 

ఈ క్వారంటైన్ టైమ్ ను ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది పూజ. దీనికి సంబంధించి పూజ హేగ్డే చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంట్లోని తన సోఫాలో రిలాక్స్ అవుతూ తన ముగ్గురు కజిన్స్ తో సేవలు చేయించుకుంటోంది. వారిలో ఒకతను ఆమె తలను మసాజ్ చేస్తుంటే మరో ఇద్దరు ఆమె చేతులు, కాళ్లు నొక్కుతూ సపర్యలు చేస్తున్నారు. పూజ మాత్రం కేక్స్ తింటూ మహారాణిలా సేద తీరుతోంది. వారికి సలహాలు కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పూజా హేగ్డే తన సోదరులతో సరదాగా చేస్తున్న ఈ ఫన్ నెటిజన్లకు కిక్కు ఇస్తోంది.

 

 

‘పూజ ఇటువంటి సేవలకు అర్హురాలు’ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో పూజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు అప్లోడ్ చేస్తూ, రెసిపీలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరోవైపు కెరీర్ పరంగా సంక్రాంతికి అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ తో, అఖిల్ సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ఎన్టీఆర్త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: