ఒకప్పుడు  సీక్వెల్ మూవీస్ విపరీతంగా వచ్చాయి తెలుగులో బట్ .. ఈ మధ్య మాత్రం సీక్వెల్స్  కి కాస్త బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మళ్లొకసారి  వరుసగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ .

 

ఒక్క సినిమా హిట్ అయితే ..అసలు ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యింది..? ఎలా హిట్ అయ్యింది ..? ఆ సినిమాలో ఉన్న హీరోహీరోయిన్లెవరు అంటూ .. మొత్తం పోస్ట్ మార్టమ్ చేస్తారు మేకర్స్ . అంతేకాదు ..మళ్లొకసారి ఈ సినిమాలకు సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తారు . ప్రజెంట్ అలాంటి పనిలోనే ఉన్నాడు ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి. 

 

కార్తికేయ, పాయల్ జంటగా రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా ఆర్ ఎక్స్ 100. అసలు ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాదు...టాలీవుడ్ మొత్తం ఈ సినిమాని పాత్ బ్రేకింగ్ మూవీ అని తెగ పొగొడేసింది. అంత సూపర్ హిట్ అయిన ఆర్ ఎక్స్ 100 సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట అజయ్ భూపతి. ప్రజెంట్ లాక్ డౌన్ తో ఫ్రీగా  ఉండడంతో  సీక్వెల్ కి సంబందించి వర్క్ మొదలుపెట్టాడట అజయ్.

 

నాని  ప్రొడ్యూసర్ గా విష్వక్ సేన్ హీరోగా శైలేష్ డైరెక్షన్లో వచ్చిన మర్డర్ మిస్టరీ ఎంటర్ టైనర్ హిట్ . ఈ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా  ఆడియన్స్ కి బాగా నచ్చింది.  ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ హిట్  సినిమాకి సీక్వెల్ కూడా చేస్తామని అనౌన్స్ చేశారు అటు హీరోతో పాటు ప్రొడ్యూసర్ నాని . 2021 లో హిట్ సీక్వెల్ తెరమీదకు రాబోతోంది. 

 

నవీన్ పోలిశెట్టి  హీరోగా వచ్చిన డిటెక్టివ్ బేస్డ్  మూవీ ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ.  ఇప్పటికే  బాండ్ మూవీస్ వచ్చి చాలా కాలం అవ్వడంతో పాటు  కంప్లీట్ కామెడీతో ఎంటర్ టైనింగ్ గా వచ్చిన ఏజెంట్ అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాగ్జిమమ్ అందరూ కొత్తవాళ్లతోనేచేసిన ఈసినిమా  ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ గా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఇలా తెలుగులో మరొకసారి సీక్వెల్స్  ట్రెండ్ రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: