సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి మూవీ ప్రకటించగానే.. ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే గత ఐదారేళ్లుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు. ఫ్లాపులు వెంటాడుతున్న సమయంలో గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్.. పవన్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా కూడా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఇండికేషన్స్ ఏమీ కనిపించడం లేదు. 

 

పవన్ కళ్యాణ్ సినీజీవితంలో గబ్బర్ సింగ్ ఓ మైలు రాయిలా నిలిచింది. ఫ్లాపులు ఊబిలోకి లాగుతున్న సమయంలో పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ మంచి బూస్ట్ నిచ్చి బయటికి లాగింది. తర్వాత గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్ధార్ గబ్బర్ సింగ్ వచ్చింది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే పవన్ ను హరీశ్ వినూత్నరీతిలో చూపించాడు. ఈ సమయంలోనే పవర్ స్టార్ అభిమానులంతా ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే బాగుంటుందని భావించారు. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ కల నెరవేరింది. 

 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో బిజీబిజీగా ఉన్నాడు. ఇంకో షెడ్యూల్ జరిగితే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. వకీల్ సాబ్ అలా పూర్తవుతుందో లేదో అపుడే డైరెక్టర్ క్రిష్ సిినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ మూవీ చారిత్రక నేపథ్యమున్న సినిమాకావడంతో షూటింగ్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశముంది. 

 

మరోవైపు ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కాగానే.. మహేశ్, రాజమౌళి కాంబినేషన్ మొదలవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయి వెండితెరపై మెరవడానికి ఇంకా సంవత్సరం పడుతుందట. ముందుగా అనుకున్నట్టుగా 2021 జనవరి 8న విడుదల  అయ్యే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు.  రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా రావాలంటే 2022లోనే అంటున్నారు సినీ పండితులు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: