టాలీవుడ్ జనాలు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసి౦దే. బాలీవుడ్ హీరోయిన్ లతో సినిమాలు చేయడానికి ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ ఉంటారు మన నిర్మాతలు. వాళ్లకు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సినిమా చేస్తే కలిసి వస్తుంది అని ప్రచారం కూడా ఫ్రీ గా చేయవచ్చు అని నిర్మాతలు దర్శకులు భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన తెలుగులో కమర్షియల్ సినిమాల హవా ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ ల మీద మన వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఈ తరుణంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంక చోప్రా ను ఎంపిక చేసారు ఒక నిర్మాత. మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమాకు గానూ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసారు అని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఓకే అయింది అని అంటున్నారు.  ఈ సినిమా కోసం ఆమె భారీగా డిమాండ్ కూడా చేసింది అని టాక్. ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తుంది అని తెలుస్తుంది. ఇందుకోసం ఆమె భారీగా డిమాండ్ కూడా చేసినట్టు సమాచారం. 

 

ముందు దీపిక ను అడగగా ఆమె అటు ఇటు గా ఓకే చెప్పారు అని ప్రియాంక అయితే వెంటనే ఓకే చెప్పారు అని ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపుగా ఖాయమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చేస్తారు. ఆ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సెట్స్ మీదకు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: