టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్స్ తో ప్రేక్షకుల మనసు దోచిన దర్శకులు శేఖర్ కమ్ముల.  దర్శకుడిగా మంచి సినిమాలే కాదు..తమ మంచితనంతో ఇప్పుడు కరోనా సమయంలో ఎంతో మందికి సహాయ పడుతున్నారు.  ఇప్పటికే జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ, బాదంపాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హిజ్రాలకు సాయంగా ఉండేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములకు జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా తాము బయటకు రాలేక.. నానా ఇబ్బందులు పుడుతున్న హిజ్రాలను ఆదుకున్నారు శేఖర్ కమ్ముల.

వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.అంతేగాకుండా వీళ్లకు సాయం చేయడానికి మరికొంత మంది ముందుకు రావాలని తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.  ఈ లాక్‌డౌన్‌ సమయంలోలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్‌జెండర్లు‌. వాళ్లు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి గూడు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వారి పట్ల ఉండే వివక్ష, అపోహలతో వాళ్ల ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్లకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు.

హెల్త్‌కేర్‌ పథకాలు వర్తించవు. సెన్సిటివ్ గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.comకు మెయిల్‌ చేయండి’అంటూ శేఖర్‌ కమ్ముల ట్వీట్‌ చేశారు. శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ఞ‌త‌గా హిజ్రాలు ‘‘థాంక్యూ శేఖర్ కమ్ముల’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు. శేఖర్ కమ్ముల మంచితనానికి అందరూ మెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: