ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఫీలింగ్ జనాలకి కలిగించడం కోసం ఈ యూనిట్ మొత్తం చాలా కష్టపడుతున్న ట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురావడానికి మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమాకి సుకుమార్ తీసుకునే రెమ్యూనరేషన్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు గాను సుకుమార్ ఏకంగా పాతిక కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయానికి సంబంధించి అఫిషియల్ గా ఎలాంటి సమాచారం లేదు కానీ సుకుమార్ రెమ్యునరేషన్ అనే అంశం మాత్రం ఎందుకో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఈ సినిమా కి అల్లు అర్జున్ కూడా పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఈ సినిమాకు గాను బన్నీ 40 కోట్ల దాకా పుచ్చుకున్నాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమాని దాదాపు పది భాషల్లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 180 కోట్ల దాకా అవుతుందట. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే గాని తమకు వర్కవుట్ కాదని నిర్మాతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: