టాలీవుడ్ లో సాయి పల్లవి గత కొంతకాలంగా సందడి చేస్తోంది. ఆమె ఫిదా సినిమా తరువాత ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ మధ్య కాస్త డిమాండ్ తగ్గింది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకు కొంత మంది స్టార్ హీరోలు పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. నటన విషయంలో సాయి పల్లవి చాలా మంది కంటే ముందు వరుసలో ఉంటుంది. దీనితో తమ సినిమాల్లో ఆమెను తీసుకునే విధంగా కొంత మంది స్టార్ హీరోలు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల ఆమెకు ఒక హీరో ఫోన్ చేసి కూడా తన సినిమాలో నటించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో సాయి పల్లవి ని తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరిగింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా సాయి పల్లవి కి తన సినిమాలో ఒక మంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న సినిమాలో రామ్ చరణ్ కు మరదలుగా సాయి పల్లవి నటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ఎలాంటి పాత్ర అయినా సరే సాయి పల్లవి తన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ తీసుకునే ఆలోచన చేశాడని టాలీవుడ్ వర్గాల మాట. దీనికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే ఈ పాత్రకు ఆమె కాస్త ఎక్కువగా డిమాండ్ చేసిందని అయినా సరే రామ్ చరణ్ ఆమెను చాలా జాగ్రత్తగా ఒప్పించాడని అంటున్నారు. కానీ ఆమె కావాలి ఆ పాత్రకు అనే రామ్ చరణ్ పట్టుబట్టి మరీ తీసుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: