ఇటీవల ఆమెకు ఒక హీరో ఫోన్ చేసి కూడా తన సినిమాలో నటించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో సాయి పల్లవి ని తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరిగింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా సాయి పల్లవి కి తన సినిమాలో ఒక మంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న సినిమాలో రామ్ చరణ్ కు మరదలుగా సాయి పల్లవి నటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.
ఎలాంటి పాత్ర అయినా సరే సాయి పల్లవి తన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ తీసుకునే ఆలోచన చేశాడని టాలీవుడ్ వర్గాల మాట. దీనికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే ఈ పాత్రకు ఆమె కాస్త ఎక్కువగా డిమాండ్ చేసిందని అయినా సరే రామ్ చరణ్ ఆమెను చాలా జాగ్రత్తగా ఒప్పించాడని అంటున్నారు. కానీ ఆమె కావాలి ఆ పాత్రకు అనే రామ్ చరణ్ పట్టుబట్టి మరీ తీసుకున్నాడట.