మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. మెగా కోడలుగా కన్నా అపోలో ఆసుపత్రి యాజమాన్యం మనువరాలుగా అందరికీ సుపరిచితురాలు.. ఇప్పుడు ఏకంగా ప్రజలకు దగ్గర అవుతుంది. తీసుకోవాల్సిన ఆహారం, సమాజం లో జరుగుతున్న ఘటనలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పై తనకు తెలిసిన విషయాలను ప్రజలకు చెప్తూ వస్తుంది. అంతేకాదు ఇటీవల ప్రజలు కరోనా వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే..



వారందరికీ తోచిన సాయాన్ని అందించి మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.. ఇకపోతే ఉపాసన కు సినీ ఇండస్ట్రీ తో పాటుగా భయట కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఉపాసన చాలా చురుగ్గా ఉంటుంది.. ఎప్పుడు ఏదోక విషయాన్ని అభిమానుల తో పంచుకుంటుంది.. ఈ క్రమం లోనే తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలుపుతూ దేవి పూజ విషయమై కళ్ళు తెరిపించే కామెంట్స్ చేసింది. బిజినెస్‌ విమెన్ ‌గానే కాకుండా సామాజికవేత్తగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎప్పటికప్పుడు మహిళా సాధికారతపై పోరాడే ఈ అమ్మడు మహిళను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది..



మహిళల రక్షణ కోసం పోరాడుతోంది. ఇకపోతే ఇటీవల ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉపాసన అందరి కళ్లు తెరిచింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని ఆమె బయట పెట్టడం ఆమె లోని పారదర్శకతకు అద్దం పడుతోంది.  ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలి అప్పుడే వారికి సమాజంలో కూడా గుర్తింపు లభిస్తుంది. మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని అన్నారు. అంతే కాదు పూజ గది నుంచి దేవి ఫొటోలను తీసేయాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: