తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర దర్శకులు ఒకప్పుడు వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.. అప్పటిలో సినీ ఇండస్ట్రీలో మోగిన పేరు దర్శకుడు రాఘవేంద్ర రావు.. ఈయన చేసిన పండ్ల ప్రయోగం సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని తెలుసు.. ఎన్ని రకాల పండ్లు ఉంటే వాటిని హీరోయిన్ బొడ్డు మీద విసురుతూ రొమాంటిక్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆయన చేసిన ప్రతి పండు ప్రయోగం సూపర్ హిట్ కూడా అయ్యాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి అప్పటి హీరోలు ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపించడం గమనార్హం..



చాలా కాలం నుంచి సినిమాలకు చెక్ పెట్టిన రాఘవేంద్ర రావు ఇప్పుడు ఇన్నాళ్లకు కెమరా ముందుకు వచ్చి సినిమాను తీస్తానని చెబుతున్నారు.. 78 ఏళ్ల వయసులో కూడా రొమాన్స్ కు కేక పుట్టిస్తాను అని ఆయన చెప్పడం నిజంగా విశేషం.1975 సంవత్సరం 'బాబు' సినిమాతో మెగా ఫోన్ పట్టి కెరీర్ ప్రారంభించిన ఆయన ఇంతవరకూ కెమెరా ముందుకు రాలేదు. చాలా కాలం తర్వాత ఇలా ఆయన చివరి సినిమాగా చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు.. తెలుగు ప్రేక్షకులు..



ఈ మధ్య ఓ దర్శకుడు చెప్పిన చెప్పిన కథ విపరీతంగా నచ్చింది. దీంతో ఆయన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు సినీ ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి.ప్రకారంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇందుకోసమై రమ్యకృష్ణ, శ్రీయ, త్రిషలతో ఇప్పటికే సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది.. ఒక దర్శకుడు ఇలా చేయబోయే ప్రయోగం ముందే సంఛలంగా మారడం ఒకందుకు మంచిదే.. కానీ ఈ విషయాన్ని నెటిజన్లు మాత్రం సీరియస్ గా తీసుకోలేదు.. ఆయన సినిమాలు ఇప్పుడు ఎవరు చూస్తారు.. ఆయన పిచ్చి కాకపోతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే తెరపై బొమ్మ పడే వరకు ఆగాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: