అవునూ.. ఓ టీవీ సీరియల్ నటిపై ఓ నిర్మాత దాడి చేశాడు. అయితే ప్రస్తుతం ఆ నటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు హీరోయిన్ కంగనా రనౌత్ మద్దతుగా నిలిచారు. అయితే ఆ నటి ఎవరు? ఆమెపై దాడి చేసిన ఆ నిర్మాత ఎవరు? ఇంతకీ వారి మద్య ఏం జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. హిందీలో అనేక టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాల్వి మల్హోత్రా. అయితే ఈమెకు గత కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో (ఫేస్ బుక్) కుమార్ మహిపాల్ సింగ్ అనే అతను పరిచయమయ్యాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకోమంటూ వేధించసాగాడు. దానికి మాల్వి ఒప్పుకోలేదు. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను అదును చూసి ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. మాల్వీ మల్హోత్రా సోమవారం ఓ షూటింగ్ ముగించుకొని ముంబాయి వెర్సోవా ప్రాంతంలో ఓ కేఫ్ నుంచి ఆమె ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్న ఆమెను కారులోంచి చూసిన సదరు వ్యక్తి ఆమెను ఆపాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ఆమెతో వాదనకు దిగాడు. ఆ తర్వాత మాట మాట పెరగడంతో కోపంతో ఊగిపోయిన అతను .. మాల్వీ పొట్టలో, చేతులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. గాయాల పాలైన ఆమెను కోకిలబెన్ అంబానీ హాస్పిటల్‌కు తరిలించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని కుమార్ మహిపాల్ సింగ్ గా గుర్తించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అతను  చిత్ర పరిశ్రమలో ఓ ప్రొడ్యూసర్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అతనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 హత్నాయత్నం, నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపధ్యంలో మహిళా కమిషన్, కంగనా రనౌత్ సాయం కోరుతూ కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్ నుండి మల్వి ​​మల్హోత్రా మొబైల్ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: