సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణ్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా తమిళంలో మాత్రం వరుస ప్రాజెక్టులు చేస్తుంది. అక్కడ కూడా కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడ్డా 96 రీమేక్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా త్రిష మరో సూపర్ హిట్ రీమేక్ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పీకూ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ రీమేక్ మూవీలో లీడ్ రోల్ లో త్రిష నటిస్తుందని తెలుస్తుంది.

పీకూ సినిమాలో దీపికా పదుకొనె నటించింది. సినిమాలో అమితాబ్ కూడా నటించాడు. అయితే తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించాలని అనుకున్నారు. వెంకటేష్ నిహారికతో ఈ సినిమా చేయాలని చూశారు కాని ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా త్రిషతో ఈ రీమేక్ ఫిక్స్ చేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఆఫర్ వచ్చినా సరే ఏవో కారణాల వల్ల చేయనని చెప్పింది త్రిష. ఫైనల్ గా ఇప్పుడు మరో సూపర్ హిట్ రీమేక్ తో రాబోతుంది అమ్మడు.

తెలుగులో చిరు ఆఫర్ కాదన్నా మాస్ మహరాజ్ రవితేజతో వినాయక్ చేసే సినిమాలో ఆమె నటిస్తుందని అన్నారు. అయితే ఆ సినిమా గురించి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. ఇక లేటెస్ట్ గా త్రిష పీకూ రీమేక్ లో నటించడం ఆమె ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు.                                                    

 

మరింత సమాచారం తెలుసుకోండి: