ఈ ఇయర్ ఆల్రెడీ భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా వస్తుంది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 30 కోట్ల దాకా పెట్టారని టాక్. 25 లోగా సినిమా పూర్తి చేయాలని అనుకోగా మరో ఐదారు కోట్లు అదనంగా ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా 30 కోట్లు సినిమా ఫైనల్ బడ్జెట్ అని టాక్.

అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. ఈ సినిమా ఓటిటి రిలీజ్..? లేదా థియేటర్ రిలీజ్..? అన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమా బడ్జెట్మ్ మిగతా విషయాలను పరిగణలో తీసుకుంటే మాత్రం సినిమా థియేటర్ రిలీజ్ చేస్తేనే అటు డిజిటల్, ఇటు థియేట్రికల్, శాటిలైట్ అన్నివిధాలుగా వర్క్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

రంగ్ దే సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులనూ అల్రిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతేకాదు నితిన్, కీర్తి సురేష్ ల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. తప్పకుండా నితిన్ ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకునేలా ఉన్నాడు. మరి నితిన్ రంగ్ దే డిజిటల్ రిలీజ వుతుందా, థియేటర్ రిలీజ్ అవుతుందా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అన్నది చూడాలి.                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: