ప్రభాస్ ఫుల్ బిజీ. అనుకున్నట్లుగా ప్రస్తుతం రాధేశ్యాం మూవీ షెడ్యూల్ సాగడంలేదు. కరోనా కారణంగా  చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా విదేశాల్లో తీయాల్సిన షూటింగ్ ఉండనే ఉంది. దాంతో 2021 సమ్మర్ కి ఎలాగైనా రాధేశ్యాం ని తేవాలన్న బిజీ ప్రభాస్ ది. ఆ తరువాత చూసుకుంటే ఆది పురుష్ వెంటనే లైన్ లో ఉంది. అది 2021 లో షూటింగ్ కన్ ఫర్మ్ గా స్టార్ట్ అవాల్సిందే.  

అదే విధంగా దాని కంటే ముందే కమిట్ అయిన నాగ్ అశ్విన్ మూవీ కూడా ఉంది. ఈ మూవీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసరికి ప్రభాస్ 2022 లోకి వచ్చేస్తాడు. మరి ప్రభాస్ కొత్త సినిమా ఎలా ఒప్పుకుంటాడు. ఆయన ఇంత బిజీలోనూ ఎవరికైనా కాల్షీట్లు ఎలా ఇస్తాడు అన్నది చర్చ.

అయితే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ మాత్రం ప్రశాంత్ ని నీడలా వెంటాడుతూనే ఉన్నాడుట. ప్రభాస్ కాల్షీట్ల కోసం ప్రశాంత్ నీల్ అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మరి ప్రశాంత్ నీల్ కూడా తీయబోయేది పాన్ ఇండియా మూవీయే. అది పక్కా యాక్షన్ మూవీ అని కూడా ప్రచారంలో ఉంది. దానికి కూడా బోలెడు డేట్స్ అవసరం. మరి ప్రభాస్ కి ఎక్కడ టైం ఉంది.

అయినా సరే ప్రశాంత్ నీల్ ప్రభాస్ డేట్స్ పట్టేశాడు అన్నది తాజా న్యూస్. ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ నుంచి రాధేశ్యాం తో కలుపుకుని నాలుగు సినిమాలు వరసగా వస్తున్నాయన్నమాట. అన్నీ కూడా పాన్ ఇండియా మూవీసే సుమా. మరి వీటికి ప్రభాస్ టైం ఎలా సర్దుతాడు అన్నదే ఇపుడు హాట్ హాట్ చర్చ. ఏది ఏమైనా రానున్న రెండళ్ళూ ప్రభాస్ ఎంత ఫుల్ బిజీ అంటే ఈ సినిమాలను చూస్తే తెలిసిపోతుంది కదా. మరి వీటిని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి రిలీజ్ చేయడంలోనే ఉంది కధ అంతా.

మరింత సమాచారం తెలుసుకోండి: