2020 ఎవరికీ కలిసి రాకపోయినా రష్మిక కు మాత్రం బాగానే కలిసొచ్చింది. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నదానికి చేతినిండా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో కథానాయికగా రష్మిక అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో పాటుగా పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. తెలుగుతో పాటుగా కన్నడలోనూ రష్మిక దూసుకెళుతోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రా హీరోగా వస్తున్న‘మిషన్ మజ్ను’ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ముద్దు ముద్దు మాటలతో, సన్నని నడుము వొంపుతో కుర్రకారును కట్టిపడేసిన ఈ రష్మిక మందనకు గూగుల్ ఎప్పటికీ మర్చిపోలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.
2020 గూగుల్ ఏడాదికి గాను‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా రష్మిక ఎంపికైంది. ఈ బ్యూటీ వివిధ రకాల భాషల్లో నటించకపోయినా ఈ గుర్తింపును మాత్రం బాగానే సంపాదించింది. కాగా ఈ చిన్నది నటించిన డియర్ కామ్రేడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీ కెవ్వరు సినిమాలు హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యాయి. అందుకే ఈ బ్యూటీకి ఈ గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారు. అయితే ఈ గుర్తింపు ఇప్పటి వరకు పొందిన వారిలో దిశా పటానీ, ప్రియా ప్రకాశ్ వారియర్, మానుషి చిల్లర్ లే ఉన్నారు. ఈ లీస్ట్ లోనే రష్మిక మందాన కూడా చేరిపోయింది. దీనితో మరింత గుర్తింపును తెచ్చుకునేందుకు రష్మిక అక్కడ ప్రసారమయ్యే కొన్ని రియాల్టీ షోలోనూ పాల్గొంటోంది. దీంట్లో భాగంగా ఈ చిన్నది తాజాగా పంజాబీ రాప్ సాంగ్ ‘టక్కర్’లో కూడా నటించింది. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా తానే స్వయంగా వెళ్లడించింది.