మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు 30 నుండి 40 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకున్నారట. కాని బోయపాటి అది కాస్త 50 నుండి 60 కోట్ల దాకా చేశాడని టాక్. సినిమాకు బడ్జెట్ సమస్యలు రాబట్టే షూటింగ్ అప్డేట్స్ ఏవి బయటకు రావట్లేదని. ఇంతవరకు సినిమా టైటిల్ కూడా నిర్ణయించలేదని తెలుస్తుంది. అయితే నిర్మాత సినిమా ఫిక్స్ అవడానికి ముందే బడ్జెట్ ఎక్కువైతే రెమ్యునరేషన్ లో కటింగ్ ఉంటుందని చెప్పాడట. అనుకున్నట్టుగానే బడ్జెట్ ఎప్పుడో మించినట్టు తెలుస్తుంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య, బోయపాటి కాంబో సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ఆ అంచనాలకు ఈ సినిమా ఏమాత్రం తగ్గదని అంటున్నారు. సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేస్తున్నాడు.. తప్పకుండా ఈ సినిమాతో బాలయ్య గర్జిస్తాడని చెప్పుకుంటున్నారు.