రన్ రాజా రన్ మూవీ తో డైరెక్టర్ గా పరిచమైన సుజిత్..మొదటి మూవీ తోనే ఆకట్టుకున్నాడు. 2014 లో విడుదలైన ఈ మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మించగా, శర్వానంద్ హీరోగా నటించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో నెక్స్ట్ మూవీ ఛాన్స్ కూడా యువి క్రియేషన్స్ వారు ఇచ్చారు. అది కూడా బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను సుజిత్ చేతిలో పెట్టారు. నాలుగేళ్లు కష్టపడి సాహో కథను సిద్ధం చేసాడు.

పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేకపోయింది. నార్త్ లో పర్వాలేదు అనిపించుకున్న సౌత్ లో మాత్రం డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ ఇమేజ్ ను వాడుకోవడం లో సుజిత్ తడబడ్డాడు, నిర్మాతలు భారీ ఖర్చు పెట్టినప్పటికీ దానికి తగ్గట్లు కథ , స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇప్పుడు సుజిత్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సుజిత్ తో జీ స్టూడియోస్ వారు ఓ భారీ సినిమా చేయాలనీ అనుకుంటున్నారట. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వాస్తవానికి సాహో తర్వాత మెగా స్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ను సుజిత్ చేతిలో పెట్టాడు. కానీ చిరంజీవి కి ఆకట్టుకునేలా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథ సిద్ధం చేయలేకపోయాడు. దీంతో సుజిత్ ను పక్కకు పెట్టి ఆ బాధ్యతలు మోహన్ రాజా కు ఇచ్చారు. ఒకవేళ చిరును మెప్పిస్తే సుజిత్ క్రేజ్ మరోలా ఉండేది. మరి ఇప్పుడు జీ స్టూడియో వారు సుజిత్ తో ఎలాంటి మూవీ చేయబోతున్నారో..కాస్ట్ క్రూ ఎవరు అనేది చూడాలి.             
 

మరింత సమాచారం తెలుసుకోండి: