వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ భారతదేశంలోని అన్ని భాషల్లో ప్రసారమవుతోంది. అయితే ఈ షో ని రసవత్తరంగా నడిపించేందుకు క్రియేటివ్ డైరెక్టర్ లతోపాటు మంచి పార్టిస్పెంట్స్.. ముఖ్యంగా మంచి వ్యాఖ్యాత కావాలి. అప్పుడే షో విజయవంతంగా కొనసాగ గలదు. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళనాడులో కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్ గా ఉంటున్నారు. అయితే త్వరలోనే కన్నడ లో సీజన్ 8 ప్రారంభం కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే నటుడు కిచ్చ సుదీప్ మీడియాతో మాట్లాడారు. అయితే మొదట్లో బిగ్ బాస్ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించమని తనని నిర్వాహకులు సంప్రదించినప్పుడు తనలో చాలా సందేహాలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నారు. ఒక పెద్ద రియాలిటీ షో కి హోస్ట్ గా నేను చేయగలనా? ఆడియన్స్ నన్ను రిసీవ్ చేసుకోగలరా? అని సుదీప్ ఎంతో ఆలోచించారట. అయితే షో నిర్వాహకులు సుదీప్ కి బాగా ధైర్యం చెప్పి ఆయన్ని షో బాధ్యతలు చేపట్టేలా చేశారు. కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో తాను బాగా ఇబ్బంది పడ్డానని సుదీప్ చెప్పారు.

అయితే 6 సీజన్ల వరకూ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుదీప్ ఆ తర్వాత తాను షో లో కొనసాగలేనని చేతులెత్తేసారట. కానీ మళ్లీ నిర్వాహకులు అతడిని ఎలాగోలా కన్విన్స్ చేసి తదుపరి సీజన్లలో కూడా కొనసాగేందుకు ప్రోత్సహించారు. ఆ విధంగా తాను ఏడవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న కన్నడ 8వ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈసారి పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ లకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. రఘు గౌడ, రాగిణి ద్వేవేది, గీతా, భారతీ భట్, ఆర్జే రాజేష్, సమీక్ష కిరణ్ శ్రీనివాస్, సునీల్ రావు, అనుష రంగనాథ్, సుక్రుత నాగ్, తబ్లా నాని, రజనీ తరంగ, విశ్వ హనుమంత నయన, శరత్ తదితరులు ఈ సారి పాల్గొననున్నారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: